ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసిన మందక్రిష్ణ

కార్వాన్‌ ప్రజాబలం ప్రతినిధి: షెడ్యూల్డు కులాల (ఎస్‌ఎసీ) వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ కలిశారు.


కమిషన్‌ చేసిన సిఫారసుల్లో క్రీమీలేయర్‌ ప్రతిపాదనను తిరస్కరించి, మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు , సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking