ముస్లిం సోదరులకు మాజీ ఎంపీ పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 21 (ప్రజాబలం) ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబోధించిన రోజుగా రంజాన్ పండుగ జరుపుకుంటారన్నారు. అల్లా సర్వమానవాళికి ఆశీస్సులు అందజేయాలని, అందరి ఆయురారోగ్యాలను కాపాడాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు.