రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 30 ఆగస్టు 2025
వి ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు – మణికొండ ఆధ్వర్యంలో మర్రిచెట్టు కూడలి సమీపాన గల మున్సిపల్ కమ్యూనిటీ హాలు నందు 31 ఆగస్టు 2025 ఆదివారం రోజున ఉదయం 8 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెడ్కేర్ డయాగ్నొస్టిక్ ఓ.యు కాలనీ వారి సహకారంతో హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాతి గాంచిన వైద్యుల పర్యవేక్షణలో మరియు వారి సూచనల మేరకు ఉచిత మందులతో పాటు, సంబంధిత ఫైబ్రో స్కాన్, బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటిక్ న్యూరో పతి, లిపిడ్ ప్రొఫైల్, టు.డి.ఎకో, ఈ.సి.జీ, హెచ్.బి.ఏ.1.సి, విటమిన్ డి, చెక్కర రక్త పరీక్ష, రక్త పోటు ఆదిగా పరీక్షలు ఉచితముగా సేవలను అందజేస్తూ, మేఘా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లూ వి ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు సవినయంగా తెలియ పరుస్తూ, ఇట్టి శుభ తరుణంలో సదవకాశాన్ని స్థానిక మణికొండ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజానీకం సద్వినియోగ పరచు కోగలరని విన్నవించు కున్నారు