పల్లేగూడెం నుండి మంగళగూడెం వరకు రహదారి విస్తీర్ణకు కోట్లు నిధులు మంజూరు
ఖమ్మం ప్రతినిధి జూలై 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలుమార్లు కలిసి వినతి పత్రాలను అందజేసి విజ్ఞప్తి చేయగా పల్లేగూడెం నుండి మంగళగూడెం వరకు రోడ్డు విస్తీర్ణ మరియు తీర్ధాల వద్ద ఆకెరు నదిపై చెక్ డ్యాం , మద్దివారిగూడెం నుండి పొలిశెట్టిగూడెం వరకు రోడ్డు విస్తీర్ణకు 55 కోట్లు నిధులు మంజూరు చేస్తూ అనుమతులను జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు.