ప్రజాబలం ప్రతినిధి :
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు , భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎనుగంటి రాజు నేత మరియు వారి మిత్ర బృందం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు లాంటి ఎన్నో సాహసభ్యతమైన నిర్ణయాలు తీసుకొని దేశ ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా కేంద్రంలో పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చే లోకసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మూడోసారి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకోవడం జరిగిందన్నారు.