వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 02 : వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్ తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు, ఇతర వాహనాల చోధకులు సీట్బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, కూడళ్ళ వద్ద సిగ్నల్ను తప్పనిసరిగా అనుసరించాలని, నియంత్రిత వేగంతో వాహనాన్ని నడపాలని తెలిపారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడుపకూడదని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటుందని, వేగ నిరోధకాలతో పాటు వాహనదారులు అర్థమయ్యే విధంగా ప్రమాద ప్రాంతాలు, మూలమలుపు ఇతర అన్ని ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా రవాణా శాఖ నుండి సేవలను మరింత వేగంగా అందించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమ, నిబంధనలను వివరిస్తూ ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులకు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking