మున్సిపాలిటీ కమీషనర్ కాల్లేడ రాజా శేఖర్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 25 : మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పురపాలక సంఘం సభ్యుల పదవి కాలం ముగిస్తునందున పురపాలక సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు.శనివారం మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మున్సిపాలిటీ కమీషనర్ కాల్లేడ రాజా శేఖర్ అధ్వర్యంలో చైర్ పర్సన్ నల్మాస్ కాంతయ్య,వైస్ చైర్ పర్శన్ పోరేటి శ్రీనివాస్,కౌన్సిల్ చెల్లా నాగభూషణం & కో- ఆప్షన్ సభ్యుల పదవి కాలం ముగిస్తునందున లక్షెట్టిపేట పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులను మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్ సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమములో కార్యాలయ మేనేజర్ టీ.రాజశేఖర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.