నూతన నియమకం

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ట్ టి ఐ నేషనల్ సెక్రెటరీ విపుల్ మహేశ్వరి తెలంగాణ లోక్ సభ 2024 ఎన్నికలలో పార్టీ లీగల్ టీం అబ్జర్వర్ గా కరీంనగర్ జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది కల్లెపల్లి లక్ష్మయ్య ను నియమిస్తూ శుక్రవారము ఉత్తర్వులు జారీచేసింది. తన నియమానికి సహకరించిన రాష్ర్ట బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, రాష్ట్ర ఛైర్మన్ పొన్నం అశోక్, మనకొండూర్ ఎంఎల్ఏ కవ్వం పల్లి సత్యనారాయణ లకు కృతజ్ఞతలు తెలిపారు . లక్ష్మయ్య నియామకం పట్ల సీనియర్ న్యాయ వాదులు ఆర్ దేవేందర్ రెడ్డి, రాచకొండ ప్రభాకర్, కొత్త ప్రకాశ్, తదితరుల హర్షం వ్యక్తంచేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking