ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం లో సోమవారం నిర్మల్ జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రతి మండలంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆయశాఖల అధికారులు వారం లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ రొజు 12 దరఖాస్తులు వచ్చాయని ,భూసమస్యలు, డబుల్ బెడ్ రూమ్ , పెన్షన్ ల పై దరఖాస్తులు వచ్చాయని ఆన్నారు.
ఈ ప్రజావాణి లో జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు