ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కి ఘణ స్వాగతం పలికిన అధికారులు, నాయకులు

 

ఆరోగ్యం వైద్య సాయం10 లక్షలు పథకంను ప్రారంభం

కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ

ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి,కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 13 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో మహాలక్ష్మి పథకం,రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం10 లక్షల పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు,రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ని రిలీజ్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, బుధవారం ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ…ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని చాలామంది అనుకున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది వైద్యం చేసుకున్నారు.కోవిడ్ రోగులకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ని కోరిన ఆయన పట్టించుకోలేదు.రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పేదలకు ఇంకా ఉపయోగం.ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంకు సూచించిన, చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు సిబ్బంది వున్నారో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఎమ్మెల్యే వివేక్ అడిగితే సమాధానం చెప్పని జిల్లా అధికారులు,
చెన్నూరు నియోజకవర్గంలో కావాల్సిన డాక్టర్లు సిబ్బందిని నియమించుకోడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడుతా హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే వైద్యం చెన్నూరు లో అందుబాటులో వుంచుతా
మహిళల కష్టాలు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం తీసుకొచ్చింది.చెన్నూరు నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తాము.కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ లో బ్యాక్ వాటర్ తో ముంపు అంశం కూడా చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి నికోరతా, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కి అన్నీ తెలిసి కూడా మౌనంగా వున్నారు.చెన్నూరు నియోజకవర్గ అన్నీ సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడుత,సింగరేణి అభివృద్ధి కోసం అన్నీ కోల్పోయిన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి,
సింగరేణి కాంట్రాక్టర్ల తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి,నా దగ్గర డాటా అంతా వుంటుంది.గత ప్రభుత్వ హయాంలో పని చేసినట్టు గా అధికారులు నిర్లక్ష్యం చేయకూడదు. చట్టానికి,నిబంధనలకు లోబడి అధికారులు పని చేయాలి,ఉదయం ఆరు గంటల నుంచే చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో వుంటాను,ఈ కార్యక్రమంలో నలల్ల భాగ్యం లక్ష్మి-ఓదెలు, ప్రభుత్వం అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మున్సిపల్, నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking