కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సంఘం సభ్యులు
ఆరె కటిక సంఘం, జియాగూడ కార్యాలయాన్ని సంఘ సభ్యులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంబించారు. శుక్రవారం భారత అభ్యదయ పాఠశాల పాత భవనంలో ఏర్పాటు చేసిన జియాగూడ ఆరె కటిక సంఘం కార్యాలయాన్ని లక్ష్మిమాతా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం అధ్యక్షుడు టి నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి వి నాగేష్ లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.