రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 29 అక్టోబరు 2024
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను ఇబ్బంది పెట్టాలనే దురాలోచనను పసిగట్టి ప్రజా సంక్షేమం దృష్ట్యా సమయోచితంగా వ్యవహరించి వారి ప్రయత్నాన్ని విఫలం గావించిన శుభ తరుణంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి హృదయ పూర్వక అభినందనలతో మణికొండ ప్రజానీకం స్వచ్చందంగా ఏర్పాటు చేసిన సంబరాలలో పాల్గొన్న బీ.ఆర్.ఎస్ పార్టీ స్థానిక వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్, రూపా రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ, అందే లక్ష్మణ్ రావు, గుట్టమిది నరేందర్, గోరుకంటి విఠల్, సంగం శ్రీకాంత్, ఉపేంద్ర నాథ్ రెడ్డి, మల్లేష్, సుమన్, కీర్తిలత గౌడ్, దిలీప్, యాలల కిరణ్, భాను చందర్, సయ్యద్ ఆరీఫ్, బోడ్డు శ్రీధర్, R.సంతోష్ కుమార్, S.ప్రకాష్, D.మహేష్, మంజు, రఫిక్, ఆశ్వక్ అలి, ప్రవీణ్, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తది తరులు పాల్గొని కార్యక్రమంను జయప్రదం గావించినారు.