హుజరాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 23
హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో ప్రజాబలం వార్షిక క్యాలెండర్ ను గురువారం రోజున ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసిపి శ్రీనివాస్ జి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ముందున్న పత్రిక ప్రజాబలం అని కొనిఆడారు. రానున్న కాలంలో కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల మన్ననలు ప్రభుత్వ అధికారుల మన్ననలు పొందాలన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా బలం హుజురాబాద్ ఆర్ సి ఇంచార్జ్ రచ్చ రవికృష్ణ టి డబ్ల్యూ జేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్, సహాయ కార్యదర్శి ఎండి ఖాజాఖాన్, ఎండి రఫిక్ తదితరులు పాల్గొన్నారు.