జమ్మికుంట, ప్రజా బలం ప్రతినిధి ఆగస్టు 9
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రెండో శనివారం సందర్భంగా ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పట్టణ ఏఈ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 33/11 కె.వి మాచనపల్లి సబ్ స్టేషన్ లో నిర్వహణ పనుల వలన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు. నేడు విద్యుత్తు అంతరాయం ఉండే ప్రాంతాలు మోతుకులగూడెం మారుతి నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ దుర్గా కాలనీ అంబేద్కర్ కాలనీ పాత మార్కెట్ ఏరియా మసీదు ప్రాంతం మాచినపల్లి గ్రామం మోత్కులగూడెం ఇండస్ట్రియల్ ఏరియా లో విద్యుత్ సరఫరా ఉండదని ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.