ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

———————————–
రాజన్న సిరిసిల్ల జిల్లా 03,ఏప్రిల్ 2023: ప్రజా బలం ప్రతినిధి గెంట్యాల ఆంజనేయులు
—————————–

సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్. ఖీమ్యా నాయక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు.

కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 23 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.

Revenue – 6
LDM – 1
MC Sircilla – 3
Nursing College – 1
MPDO Thanagllapalli – 1
DCO – 2
MC Vemulwada – 1
SP Office – 1
S cCorporation – 1
Civil Supply Manager – 1
DPO – 3
R&B – 1
Cess – 1

TOTAL – 23

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking