మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 24:
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ,తో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవడానికి వస్తున్న ప్రతిఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.