రాజేంద్ర నగర్ ప్రజాబలం ప్రతినిది 12 సెప్టెంబర్ 2023: చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి దగ్గర గత 15 సంవత్సరములుగా డ్రైవర్ గా, నమ్మకముగా తన ఇంటిలో ఒక సభ్యునిగా పనిచేస్తున్న రమేష్ దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో మరణించాడని తెలుసుకొని తీవ్ర కలత చెందానని, రమేశ్ మరణం వారీ కుటుంబానికి తీరని లోటని భావోద్వేగంతో రంజిత్ రెడ్డి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపడమే కాకుండా దైర్యంగా ఉండాలని అన్నివిధాల సహాయ సహకారాలను అందిస్తు అందుబాటులో అండగా ఉంటానని తెలియ జేసినారు.