పురాణఫూల్‌ చౌరస్తా ధగర ఉన్న గాంధీ విగ్రహం వద్ద రేవంత్‌ రెడ్డి ఫోటో కి పాలాభిషేకం చేసిన

కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి పరమేశ్వరి సింగ్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని మంగళ్‌హట్‌ డివిజన్‌ పూరాణాపూల్‌ చౌరస్తా లో ప్రజాపాలన ప్రజావిజయోత్సవాల వేడుకల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి పరమేశ్వరి సింగ్‌ నేతృత్వంలో పురాణఫూల్‌ చౌరస్తా ధగర ఉన్న గాంధీ విగ్రహం ముందు మన ప్రియతమ ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి ఫోటో కి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు ఒక సంవత్సరం ఉత్సవం లో భగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి పరమేశ్వరి సింగ్‌ మాట్లాడుతూ

సోమవారం డిసెంబర్‌ 9న నెక్లెస్‌ రోడ్‌ సెక్రెటెరియట్‌ లో సాయంత్రం 5గంటలకు తెలంగాణా తల్లి విగ్రహ ఆవిష్కకరణ మరియు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డి పాల్గోనే సభలో గోషామహల్‌ నియోజక వర్గ కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గోనాలని అన్నారు. ఈ కార్యక్రమం లో అజ్జు ఠాకూర్‌, భద్రినాథ్‌, ముండ్రాయి శ్రీనివాస్‌, కైలాష్‌ సింగ్‌, శశి రాజ్‌ సింగ్‌, ఖదీర్‌, వెంకటేష్‌, అనిల్‌, జె మల్లేష్‌ ,ధర్మేష్‌ సునీల్‌ సాహు,గులాభ్‌ సింగ్‌, శోభా బాయి, రేణుక శంకరమ్మ పి శాంత పాల్గొన్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking