హైదరాబాద్ ఆగస్టు 30 (); భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఫర్నిచర్, తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరన లో బాగంగా హైదరాబాద్ లోని మలక్ పేట లో తమ స్టోర్ను ప్రారంభించింది. ఈ స్టోర్ను అభిమానుల సమక్షంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ ఛైర్మన్ విజయ్ సుబ్రమణియం, మేనేజింగ్ డైరెక్టర్ మథన్ సుబ్రమణియం, రిటైల్ హెడ్ హెచ్ ఎస్ సురేష్ , ఆంధ్ర ప్రదేశ్&తెలంగాణ స్టేట్ హెడ్ ప్రద్యుమ్న కరణం , సేల్స్&మర్చండైజింగ్ హెడ్ ప్రశాంత్ కోటియాన్ తో కలిసి ప్రారంభించారు. వినియోగదారులు సోఫాలు, రిక్లైనర్స్, డైనింగ్ టేబుల్స్ , మ్యాట్రెసస్, బెడ్స్, ఇంటీరియర్ డెకార్ మరియు సమగ్ర శ్రేణి ఆఫీస్, ఔట్ డోర్ ఫర్నిచర్ తో సహా అనేక రకాల స్టైలిష్ మరియు ఫంక్షనల్ వస్తువులను కస్టమర్లు కనుగొనవచ్చు. ఈ స్టోర్ హైదరాబాద్ లో రాయల్ ఓక్ యొక్క మొత్తం స్టోర్స్ సంఖ్యను 19 కు చేర్చుతుంది. ఈ స్టోర్ ప్రతి సంవత్సరం 2 లక్ష కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించనుంది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ చైర్మన్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ, ‘‘మా తాజా స్టోర్ను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా వున్నాము. ఈ స్టోర్, సరసమైన ధరలలో అత్యుత్తమ ఫర్నిచర్ అందించాలనే రాయల్ఓక్ నిబద్దత కు ప్రాతినిధ్యం వహిస్తుంది.ఈ స్టోర్, మా వినియోగదారులకు అసాధారణమైన షాపింగ్ అనుభవాలను అందించగలదనే భరోసా కల్పించేందుకు మా బృందం తీవ్ర కృషి చేసింది. అత్యంత ఆకర్షణీయమైన మరియు పనితీరు కలిగిన ఫర్నిచర్ ను వినియోగదారులు ఇక్కడ ఎంచుకోవచ్చు. తమ ఇంటి కోసం ఖచ్చితమైన ఫర్నిచర్ ఎంచుకునేలాసహాయపడేందుకువినియోగదారులను స్వాగతించేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.