గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:28-7-23 శుక్రవారం జై భవాని ఆలయం గౌలిగూడ పాత బస్ డిపో ఎదురుగా వున్న ఆలయంలో ఉదయం 11:00 లనుండి శ్రీమతి శాంతమ్మ మరియు 45 మంది మహిళా మణుల బృందం అమ్మవారికి 11,000 పసుపు గౌరమ్మ లను చేసి అమ్మవారికి సమర్పించి మారు బోనాం ఎక్కించినారు. చైర్మన్ శంకర యాదవ్ గారి ఆధ్వర్యంలో శాంతమ్మ గారు మహిళలందరికీ పసుపు బొట్టుతో కూడిన తాంబూలం ఇచ్చి సత్కరించడం జరిగింది.