హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ జూలై 28 నిజామా బాద్ జిల్లా కు చెందినా ప్రముఖ సంఘ సేవకురాలు పాటిబండ్ల జోత్స్నహోప్ తియాలోజి యూనివర్సిటి వారిచే గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరిగిన గ్రాడియేట్స్ అవార్డుల కార్యక్రమం లో మాజి కేంద్ర మంత్రి,ఐడిసి చేర్మెన్ సముద్రాల వేణుగోపాలా చారి చేతుల మీదుగా ఈ అవార్డ్ను అందుకున్నారు.ఈ కార్యక్రమం లో హైదరాబాద్ అదనపు డిసిపి రామదాస్ తేజావత్, సంఘ సేవకురాలు కాకుమాను జ్యోతి ,రిటైర్డ్ ఏఎస్పి ఇ.ఆనంద్, కే.స్వామి, సిహెచ్.రామకృష్ణ, జే.ఎన్.రాజేందర్, ఎస్ఎస్.సమీర్ తదితరులు పాల్గొన్నారు.