మాల్కాపూర్, తూప్రాన్, ఫిబ్రవరి, 15. ప్రాజబలం ప్రతినిధి.
మెదక్ జిల్ల తూప్రాన్ మండలం మల్కాపూర్ లో నూతనంగా అమిరిశెట్టి సతీష్ కుమార్, వీణ లు నిర్మించిన శివ పంచాయతనం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు శనివారం ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువంధనం, వేధస్వస్తి, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య, ప్రాషణ, ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ఆఖండదీప స్థాపన, వాస్తు పూజ, నవగ్రహ సహిత సర్వతిభద్ర మండపారాధన, ప్రధాన కలశ స్థాపన , సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, మూల మంత్ర జపములు, జలాదివాసం, ప్రదోష కాల పూజలు, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమం అమీరిశెట్టి సతీష్ కుమార్, వీణ పుణ్య దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ ప్రజలు పుర ప్రముఖులు, పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.