గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజకవర్గంలోని గన్ఫౌంఢ్రీ డివిజన్ ట్రూప్బజార్లో శ్రీ సత్య సాయి హోల్సెల్ ఎయిర్ కూలర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా మాజీ గన్ఫౌంఢ్రీ డివిజన్ కార్పోరేటర్ కాంగ్రెస్ నాయకులు మమతా సంతోష్గుప్తా ప్రారంభించారు.ఈ సందర్భంగా మమతాసంతోష్గుప్తా మాట్లాడుతూ రానున్నది వేసవికాలం పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో (హోల్సేల్) మార్కెట్ ట్రూప్బజార్లో ఎయిర్కూలర్లు లభించబడును.శ్రీ సత్య సాయి వ్లోసేల్ ఎయిర్ కూలర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రజలకు అందుబాటు ధరలలో అందించి దినదినాభివృద్ది చెందాలని అన్నారు.ఈ కార్యక్రమానికి విచ్ఛేసిన మాజీ గన్ఫౌంఢ్రీ డివిజన్ కార్పోరేటర్ కాంగ్రెస్ నాయకులు మమతా సంతోష్గుప్తాను ఘనంగా సన్మానించారు.
