ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు లక్ష్మణచాంద మండలం బోరిగాం గ్రామంలో ప్రారంభమై వడ్డేపల్లి, బోరిగాం తాండ, కాశీగూడ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు జనంలోకి తీసుకెళ్తామని గురువారం తెలిపారు