అధ్యక్షుడిగా ఎన్నికైన నర్సింగ్ రావును సన్మానించిన నాయకులు
ఆరె కటిక సంఘం జియాగూడ నూతన అధ్యక్షుడిగా టి నర్సింగ్ రావును ఎన్నుకున్నారు. ఆదివారం ఏకే ట్రస్ట్ పెద్దల సమక్షంలో ఏకే భవన్ లో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సంఘం అనుబంధ సంఘాలైన చర్మకష్ సంఘం, నవయువక సంఘం తదితర సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరె కటిక కులాభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు.