హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి బిఆర్ఎస్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద్ కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ పై చేసేది చారెడంత… చెప్పేది బారెడంత…బిఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద్ , పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు రుణమాఫీ పై ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ….. ప్రభుత్వం నిన్న సంబరాల పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని అసలు ప్రభుత్వం సంబురాలు ఎందుకు చేసుకుంటుందో ప్రజలకు చెప్పాలి అని ఆరోపించారు.డిసెంబర్ 9 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకా నిబంధనల పేరుతో అందరికీ రుణమాఫీ కాకుండా కొందరికే రుణమాఫీ చేస్తూ మాట నిలబెట్టుకోనందుకా అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది చారెడంత…? చెప్పేది బారెడంత…? అని ఏద్దేవ చేశారు.ఎన్నికలకు ముందు ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు అనేక రకాల రూల్స్ పెట్టారన్నారు.
Next Post