రంగారెడ్డి జున్ 21 ప్రజ బలం ప్రతినిది: ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఘట్కేసర్ గురుకుల్ కాలేజ్ గ్రౌండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సనాతన ధర్మంలో యోగ ఒక భాగమని శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనసుతో, మనసును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయడమే యోగ పరమార్థం అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చాటిచెప్పే యోగా ప్రపంచ దేశాలను యోగ వైపు చూసేలా చేసేయని ఇది భారతదేశం యొక్క గర్వకారణం అని దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉందన్నారు. నిత్యం యోగ చేసే వ్యక్తులకు అనారోగ్య సమస్యలు ఉండవని ఆరోగ్యంగా ఉంటారన్నారు.