-ఎస్సై చేతుల మీదుగా చిన్నారికి బహుమతి ప్రధానం
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 3 :
మంచిర్యాల జిల్లా నృత్య కళాకారుల అసోసియేషన్, టాలెంట్ నృత్య కళా నిలయం సంయుక్తంగా నిర్వహించిన బాల ప్రతిభా కళోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈపోటీలలో అత్యంత ప్రతిభ చూపిన తులసి హిరెన్శ్రీ ప్రధమ బహుమతి గెలుచుకుంది. తన అద్భుత ప్రతిభా నైపుణ్యంతో మొదటి స్థానం సాధించిన చిన్నారికి మందమర్రి ఎస్.ఐ రాజశేఖర్ చేతుల మీదుగా బహుమతిని అందుకుంది.