ఇండస్ట్రీయల్ హబ్ తో దశ మారనున్న వేంపల్లి,ముల్కల్ల గ్రామాలు

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 07 : మంచిర్యాల నియోజకవర్గంలోని వేంపల్లి,ముల్కల్ల గ్రామాల్లో ఇండస్ట్రీ యల్ హబ్ మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్చందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను ఇచ్చిన వారికి పరిహారం నెలలోపు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.ఎకరానికి పదమూడున్నర లక్షలు పరిహారంగా చెల్లిస్తామని తెలిపారు.పరిహారంతో పాటు దసరా నాటికి అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి అప్పగిస్తానని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు తర్వాత భూనిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ఎల్లంపల్లి నిర్వాసితులకు ఇప్పటికి పరిహారం అందలేదని గుర్తు చేశారు.పారిశ్రామిక రంగం అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుపడిన సహించబోమని స్పష్టం చేశారు.విపక్షాలు అభివృద్ధి ని అడ్డుకోవాలనే కుట్ర పన్నాయని ఆరోపించారు.బీజేపీ వ్యాపార పార్టీ ఓట్ల కోసం మతం జపం చేస్తుందని బీఆరెస్ దుకాణం మూతపడిందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమి చేయలేక పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన అభివృద్ధి,సంక్షేమం కు కృషి చేస్తోందని అన్నారు.ప్రజల కు మాట ఇచ్చానంటే ఎట్టిపరిస్థితుల్లో తప్పనని తప్పితే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking