మహబూబాబాద్ ప్రతినిధి డిసెంబర్ 13 (ప్రజాబలం) డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కురవి,సీరోలు మండలాల్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి అర్ధిక సహాయం చేసి ఓదార్చారు.. సీరోలు మండలం కోత్తూరు సి శివారు గుజిలితండా కు చెందిన జాటోతు సాలి అనారోగ్యం ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కురవి మండలం నేరడ తండాలో సూధనపల్లిలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయ్యగారిపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న జక్కుల కోమురమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు