విద్యుత్ షాక్ తో ఒకరి మృతి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మెత్రి నరేందర్(38) అనే వ్యక్తి సోమవారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నిర్మాణపు పనులు కొనసాగుతుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడని పేర్కొన్నారు. కుటుంబీకులు స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని మృతుని భార్య రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది. ప్రజాప్రతినిధులు అధికారులు మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking