ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 04 : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి దండేపల్లి మండలం రెబ్బనపల్లి, వెంకటపూర్,దండేపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని మరొకసారి ప్రధాన మంత్రిని చేయాలని అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్ధి గోమాసే శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,నాయకులు గడిగొప్పుల సురేందర్, తోట రమణయ్య, ముత్తి వెంకటేష్, వనపర్తి రాకేష్,ముత్తి అనిల్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.