జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ ని అఖండ మెజార్టీతో గెలిపించండి
……రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి మే 4 ప్రజాబలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని చౌటకూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన 6 గ్యారంటీలను, వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలను స్థాపించి ఉద్యోగ , ఉపాది అవకాశాలు నిరుద్యోగ యువతకు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తలు లేనిది నాయకుడు కాలేడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చిన 5 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.