హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్రోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్) ను కేబినెట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు.
తనను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా నియమించినందుకు ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఐఎఎస్ అధికారి స్రోమేష్ కుమార్.