రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి:మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని ఆల్కాపుర్ రోడ్డు నంబర్ 4 నందు గల స్వామీ వివేకానంద పార్కులో భారత దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వయోజన స్నేహ బృందం సభ్యులు గంగాధర్, సత్యకుమార్, నరసింహ స్వామి, రంగనాయకులు, సింగం శ్రీనివాస్, రమణ రెడ్డి, జితేందర్, సుధాకర్, విజయ్ కుమార్, రాజిరెడ్డి, బీ.ఆర్ రెడ్డి, రాము, ప్రమోద్ శర్మ, కృష్ణా వార్ల ఆద్వర్యంలో జండా పండుగ సందర్భముగా త్రివర్ణ పతాకాలను చేత బూని పిల్లలు పెద్దలు కలసి కట్టుగా పార్కు ఆవరణ మొత్తంగా చుట్టుముట్టి భారత్ మాతాకీ జై నినాదాలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడంలో తమ వంతు పూర్తి సహకారన్నందించిన వీ.ఆర్.4 సహయోగ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు, బోడ్డు శ్రీధర్, నారోత్తం సింగ్, తబ్రెజ్ ఉసేన్, మోహన్, నిర్మల్ చంద్ గొలెచా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కావించినారు.