మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
– దిచక్రవాహనం పై నుండి పడ్డ బాబాగౌడ్ను రక్షించిన ఎమ్మెల్యే
– 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే
– ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి
– ఆసుపత్రి సూపరిండెంట్ కు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
మెదక్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ నియోజక వర్గంలోని పాపన్నపేట మండలంలో మంగళవారం నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోంటున్న తరుణంలో పొడ్చంపల్లి తాండా నుండి పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి వెల్తున్న క్రమంలో దిచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడిన పాపన్నపేట కు దున్న బాబాగౌడ్ ను చూసిన ఎమ్మెల్యే కారును ఆపి వెంటనే వారి వద్ద చేరుకోని హుటాహుటిన 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి బాబాగౌడ్ ను ఆసుపత్రికి తరలించిన తీరును చూసి పలువురు అభినందించారు. మానవత దృక్ఫథాన్నికి నిదర్శనం అని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అని పలువురు ప్రశంసించారు.