
మౌలాలి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, మౌలాలి లో ఉన్నటువంటి పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ జె. మేరీ ఫ్లోరెన్స్ అలాగే వారి టీం మెంబెర్స్ అందరు కలిసి మల్కాజిగిరి లో ఉన్నటు వంటి గ్రేస్ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఒక నెలకి సరిపడా నిత్యావసర వస్తువులను వారికీ ఇవ్వటం జరిగింది. అలాగే వాళ్ళకి ఫ్రూప్ట్స్ కూడా పంచటం జరిగింది.
ఈ ప్రోగ్రామ్ లో జనరల్ సెక్రటరీ నాగలక్ష్మి , కో ఆర్డినేటర్ పద్మ , మెంబెర్ శామ్యూల్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కి సహాయం చేసిన వాళ్ళు ఆగష్ట్ను గారు,స్వప్న గారు,.లక్ష్మి , అనిల్ బాబు ,శ్రీనివాస్, సాయిపవన్ , యూనిస్ , స్వాతి , తదితరులు సహాయ సహకారం చేసి సొసైటీ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసారు.