ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం)ఖమ్మం ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని, ఆ మహాత్ముని స్పూర్తితో సమాజానికి సేవలందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి.మాలతి, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.