మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 09 : ఉగాది పండుగను పురస్కరించుకొని క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పంచాంగ శ్రవణం,భజన కార్యక్రమం చేయడం జరిగింది.బుధవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో వేధ పండితులు ఆశీస్సులు తీసుకుంటారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని పంచాంగం,భజన కీర్తనలు చెయడం జరిగిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేధ పిండితులు,వారి కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.