మణికొండలో అంబేద్కర్ జయంతి సంబరాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 14 ఏప్రిల్ 2025
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ నాయకులు కార్యకర్తలు శ్రేయోభి లాషుల తరపున స్థానిక మున్సిపాలిటీ పరిధిలో నెక్నంపూర్ లోనీ గవర్నమెంట్ పాఠశాల వద్ద జై భీం నినాదాలతో పండుగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలను ఘనముగా మొదలుపెట్టి పుప్పలగూడ పరిధిలోనీ పైపులైన్ రోడ్డులో గల నరసింహ స్వామి ఆలయం ఎదురుగా, మణికొండ పరిధిలోని మర్రిచెట్టు కూడలి వద్ద, శివాజీ నగర్ కమ్యూనిటీ హాలు వద్ద, శివపురి కాలనీ కూడలిల వద్ద ఉత్సాహంతో నిర్వహించడం జరిగినదని భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking