ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 13 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రానికి చెందిన బోర్లకుంట జాని సుజాత దంపతుల ముద్దుల కూతురు అన్వేష పుట్టినరోజు సందర్భంగా దండేపల్లి మండలంలోని రాజంపేట గ్రామంలో కొక్కీస రమ నిరుపేద మహిళా కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులతో కూడిన అమృత కలశం మరియు 25 కేజీల బియ్యం. సత్య సాయి భజన మండలి దండేపల్లి వారి ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ రాపర్తి రాజన్న. సేవాదళ్ కోఆర్డినేటర్ పసుపు నూటి సాయిరాం.జాయింట్ కోఆర్డినేటర్ తాళ్ల కుమార స్వామి గౌడ్.దుర్గం గురవయ్య.మాడిశెట్టి అఖిల్. గ్రామస్తులు పాల్గొన్నారు