రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 సెప్టెంబర్ 2023: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అంతర్భాగమైన మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పుప్పాలగూడలో గల శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వనాథ సమేత నల్ల పోచమ్మ ఆలయంలో ఉన్న శ్రీ శివలింగానికి గత 63 రోజులుగా జరుగుతున్న రుద్రాభిషేకంతో పాటు అందులో భాగంగా ఆదివారం రోజున లోక కళ్యాణార్థం మాహా రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించడంతో పాటు దేవి కటాక్ష అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగినదని నేడు 18-09-2023 సోమవారంతో ఇప్పటి వరకు పాల్గొన్న భగవత్ భక్తులందరు ఆ విశ్వనాథ స్వామీ కృపా కటాక్షాలకు పాత్రులైన శుభ ఘడియలలో పూజలన్ని జయప్రదంగా ముగియడం జరిగినదనీ ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ శాంత్ కుమార్ శర్మ తెలియజేసినారు.