రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 24 ఫిబ్రవరి 2025
వీ ఆర్ 4 సహయోగ చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో గత సంవత్సరం మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని 9 కుడళ్లలో రహదారి బాటసారుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి సరఫరార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినదని, ట్రస్టు పదాది కారులు, సభ్యులు మరియు పురజన పెద్దల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం అదనంగా అవసరమున్న 5 కుడళ్లలో ప్రజా సంక్షేమం దృష్ట్యా వారి సౌకర్యార్ధం మొత్తంగా 14 కుడళ్లలో ఉచిత మంచినీటి సరఫరా చేయడానికి చాలివేంద్రాల ఏర్పాట్లు గావిస్తున్నమని, సదరు విషయమై మునిసిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశి వారి యొక్క అనుమతులు మంజూరు చేసిన వెంటనే ఉచిత త్రాగు నీటి సరఫరా మొదలు పెడతామని వీ ఆర్ 4 సహయోగ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినాడు.