ఎమ్మెల్సీ కవిత
మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని బిజేపి రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఆరోపించారు.
చట్టం ఉంది కాబట్టే స్థానిక సంస్థల్లో 14 లక్షల మహిళల ప్రాతినిధ్యమన్నారు.
భారీ మెజారిటీ ఉన్న మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదనీ కవిత ప్రశ్నిచారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావాలనీ డిమాండ్ చేశారు.
మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దన్నారు.
ఈ సందర్భంగా కవిత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.