పేదల గుండెలో నిలచి పోవాలని ఉంది
….ఏం ఎ ముఖిం సబ్
సంగారెడ్డి అక్టోబర్ 18 ప్రజ బలం ప్రతినిది:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మనబిన్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ను జిల్లా కేంద్రంలోనీ కింగ్ ప్యాలెస్ లో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళననికీ భారీగా జనం హాజరైనారు. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో మనబిన్ ఫౌండేషన్ ఛైర్మెన్ , సుప్రీమ్ కోర్ట్ ప్రముఖ న్యాయవాది ఎం.ఏ ముఖీమ్ మాట్లాడుతూ ప్రజలకు సేవచెయ్యలని ఈ ఎలక్షన్ లో సంగారెడ్డి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా నిలబడుతున్ననని, ప్రజలందరూ ఆశీర్వదించాలని , ప్రజాసేవ చేసే అవకాశం అందించాలని, త్వరలో ఏ పార్టీ తర్పున పోటిచేసేది తన అభిమానుల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. బడుగు బలహీన వర్గాల కు, పెదలకు పెళ్ళిలకు, చదువులకు అవసరమైన సహాయాన్ని గత కొన్నేళ్ళుగా మనబిన్ ఫౌండేషన్ అధ్వర్యంలో అందిస్తున్నామని, ఎల్లప్పుడూ నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఉందనీ ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాసేవ చేయడానికి అవకాశము కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న మనబిన్ ఫౌండేషన్ సభ్యులు సత్తయ్య యాదవ్, ఇలియాస్ షరీఫ్, మునిపల్లి రమేష్, కృష్ణమూర్తి సిరిగిరి
ఉస్మాన్ , ప్రభు , అజాజ్, పప్పు చౌష్, అశోక్, జావీద్ , బబ్లూ, శంకర్ నాయక్, ,శ్రీశైలం, జార్జ్, షాబోద్దీన్, తరుణ్, మహబూబ్, ఫైసల్, పవన్
తరితరులు పాల్గొనరు.
