శ్రీకాకుళం మార్చ్ 11 ;జనతా దళ్ (యునైటెడ్)( జేడియు) శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా బూర్గాపు రాజేశ్వరరావు నియమితులైనారు. ఈ మేరకు జేడియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అద్యక్షులు కే.వి.సుబ్బయ్య ఆదేశాలమేరకు పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బూర్గాపు రాజేశ్వరరావు మాట్లాడుతూ పార్టి నిర్ణయానికి కట్టుబడి శ్రీకాకుళం జిల్లా లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనపై గల నమ్మకం తో తనను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా నియమించిన పార్టీ రాష్ట్ర అద్యక్షులు కే.వి.సుబ్బయ్య,అందుకు సహకరించిన పార్టీ ప్రదాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు కు అలాగే పార్టీ శ్రీనులకు పేరుపేరునా అభినందనలు తెలిపారు.