మెదక్ తూప్రాన్ ఆగస్టు 11 ప్రజాబలం న్యూస్ :-
నలంద విద్యా సంస్థల అధినేత డా.పి.వి. రమణ గారి ఆధ్వర్యంలో తల్లితండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తల్లితండ్రుల సమక్షంలో విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించారు .ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొని పిల్లలను ఉద్దేశించి వారి భవిష్యత్తు కి సంబందించిన దిశానిర్దేశం చేశారు. ఇట్టి కార్యక్రమంలో నలంద జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.