కరీంనగర్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 23
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు లోని ఎంప్లాయిస్ కాలనీలో HNO:- 7- 4- 17/2, ఇల్లు అక్రమ కట్టడమని కందికట్ల సంధ్య, W/o మధుసూదన్ అనే ఇంటి యజమాని నూతన మున్సిపల్ నిబంధనలను పాటించకుండా మున్సిపల్ ఆదాయానికి ఎగనామం పెడుతూ రాజకీయ నాయకుల అండదండలతో మమ్ములను అడిగే వారు లేరని ధీమాతో మున్సిపల్ నుండి సాధారణ గృహ నిర్మాణానికి అనుమతులు తీసుకుని టౌన్ ప్లానింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చిన తీరుగా ఎలాంటి అనుమతులు లేకుండా పై అంతస్తు నిర్మించారని కావున ఈ అక్రమ కట్టడంపై వెంటనే ఉన్నతాధికారులచే విచారణ జరిపించాలని సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు చెల్పూరి రాము ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.