యోగ ద్వారా వైరుథ్యాలు చెరిపేయాలి

న్యూయార్క్‌, జూన్‌ 21, (న్యూస్‌ పల్స్‌) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి అమెరికా నుంచి ప్రసంగించారు. వీడియో సందేశం ద్వారా విూ అందరితో కనెక్ట్‌ అవుతున్నానని, కానీ యోగా కార్యక్రమం మిస్‌ కావడం లేదన్నారు ప్రధాని మోదీ. భారత కాలమానం ప్రకారం సాయం త్రం 5.30 గంటలకు ఐక్యరా జ్యసమితి ప్రధాన కార్యాల యంలో జరిగే భారీ యోగా కార్యక్రమంలో పాల్గొంటాను అన్నారు. భారత్‌ పిలుపు మేరకు ప్రపంచంలోని 180కి పైగా దేశాలు ఏకతాటిపైకి రావడం చారిత్రా త్మకం అని అభిప్రాయ పడ్డారు. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదన వచ్చినప్పుడు రికార్డు స్థాయిలో దేశాలు మద్దతిచ్చాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది. ఓషన్‌ రింగ్‌ ఆఫ్‌ యోగాతో ఈ ఏడాది యోగా డే కార్యక్రమాలు మరింత ప్రత్యేకమ య్యాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వసుధైవ కుటుంబకం ఆధారంగా యోగా చేస్తున్నారు. యోగా మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్‌ను, బలాన్ని ఇస్తుందని మన గ్రంథాల్లో చెప్పారు. మనలో ఎంతమంది యోగా శక్తిని అనుభవించారు? వ్యక్తిగత స్థాయిలో మంచి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. యోగా శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది.
స్వచ్ఛభారత్‌ వంటి అంశాల్లో స్టార్టప్‌లకు గత కొన్నేళ్లుగా కనిపించిన అసాధారణ వేగం ఈ శక్తి ప్రభావాన్ని చూపిందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ సంస్కృతి, సామాజిక నిర్మాణం, ఆధ్యాత్మికత, దార్శనికత ఎప్పుడూ కొత్త ఆలోచనలను స్వీకరించే, ఆదరిస్తుందన్నారు. ఎల్లప్పుడూ స్వాగతిస్తున్నామన్నారు. మనం భిన్నత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నామని అలాంటి ప్రతి అవకాశాన్ని యోగా బలపరుస్తుందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగా ద్వారా మన వైరుధ్యాలు చెరిపేయాలి. యోగా ద్వారా మన అడ్డంకులను అధిగమించాలి. ఏక్‌ భారత్‌`శ్రేష్ఠ భారత్‌ ను ప్రపంచానికి అందించాలి. కర్మలో నైపుణ్యమే యోగం అని చెప్పారు. మనందరికీ ఈ మంత్రం చాలా ముఖ్యమైంది. యోగాతో మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ఈ తీర్మానాలను అలవర్చు కుంటామ ని విశ్వసిస్తున్నాను. ఆరోగ్యమే మహా భాగ్యందేశ్వవ్యాప్తంగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి గ్రావిూణ పట్టణ ప్రాంతాల్లో యోగా చేస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని హవిూర్‌పూర్‌లో యోగా చేశారు. హవిూర్‌ పూర్‌ లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకులకు అనురాగ్‌ ఠాకూర్‌ ముఖ్య అతిథిగా హాజరై.. అందరితో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం యోగా అందరూ చేయాలని కోరారు.భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బుధవారం గురుగ్రామ్‌లోని తౌ దేవి లాల్‌ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కూడా హరిద్వార్‌లో యోగా చేశారు.జబ ల్‌పూర్‌లోని గ్యారీసన్‌ గ్రౌండ్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఆయుష్‌ మంత్రి సర్బానంద్‌ సోనోవాల్‌ యోగా చేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌ పూణేలో, అశ్వినీ వైష్ణవ్‌ బాలాసోర్‌ లో జరిగిన కార్యక్రమంలో యోగా చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో సాయంత్రం జరిగే అంత ర్జాతీయ యోగా దినోత్స వంలో ప్రధాని మోడీ పాల్గొన నున్నారు. కాగా, ప్రతిసారీలాగే ఈసారి కూడా దేశంలోని నలు మూలల కూడా యోగా కార్యక్ర మాలు నిర్వహి స్తున్నారు. యోగా ప్రయోజనాల గురించి అవగా హన పెంచడా నికి, శారీరక, మానసిక, ఆధ్యా త్మిక శ్రేయస్సుకు తోడ్పాటు నం దించేందుకు యోగా సహక రిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking