కూకట్పల్లి (ప్రజాబలం )ఏప్రిల్ 08:
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో బాలనగర్ డివిజన్ ఇందిరానగర్ కాలనీకి సంబంధించి కాంగ్రెస్ నాయకులు పుట్టపాగ మధు, బాలరాజు, కురుమయ్య సహా 50 మంది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బి ఆర్ఎస్ నాయకుడు గిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గాన్ని గత పది సంవత్సరాల్లో ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దారని ఇందిరానగర్ కాలనీ ఒకప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో కళ్ళ ముందు కనిపిస్తుందని దీనంతటికి కారణం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి అని అన్నారు.. రోడ్లు, డ్రైనేజ్ విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలకు నేడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన ఆధ్వర్యంలోనే కాలనీ ని అభివృద్ధి చేశారని అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకున్నారని నేడు జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలన తీరు చూసి ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే అభివృద్ధికి పట్టం కట్టాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నామని తెలిపారు…